నిధులు మంజూరు చేయాలని వినతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ: టీఎన్జీవోస్ భవన నిర్మాణ భూమి పూజకు హాజరుకావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ ను యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనను టీఎన్జీవోస్ ఎల్లారెడ్డి అధ్యక్షుడు లచ్చిగారి మహపాల్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యదర్శి వరాల శరణ్ కుమార్, కోశాధికారి రవీందర్, జాయింట్ సెక్రటరీ రాజగౌడ్, శ్రీకాంత్, అరుణ్, ముఖీద్, ఉద్యోగులు పాల్గొన్నారు.