Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2024, 2:42 pm Posted by : ramakrishna

మంత్రి రాజనర్సింహను కలిసిన ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు

సంగారెడ్డి, బతుకమ్మ: రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ఉమ్మడి వేదిక నాయకులు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులగం మోహన్, చంద్రశేఖర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జన విజ్ఞాన దర్శిని టి రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాసభపై మంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు.