Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 7:14 pm Posted by : ramakrishna

పునరుద్దరణ పనులు చేపట్టాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో పర్యటించి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ బోర్డ్ వైకుంఠధామం యందు అత్యవసరంగా ఏర్పాటు చేయబడుతున్న రోడ్డు పనులను, వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ ను  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారుల కు వెంటనే అత్యవసరంగా పునరుద్ధరణ పనులను చేపట్టవలసిందిగా ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనిఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ శంకర్, వేణు ప్రసాద్, కామారెడ్డి డిప్యూటీ తహసిల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Renovation work should be carried out.