నిాజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ (ఇంటిగ్రేటెడ్ ), ఎల్ ఎల్ బి రివాల్యుయేషన్ కొరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ విడుదల చేశారు. పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్- ఏపీ ఈ, పి సి హెచ్, ఐ ఎం బి ఏ, ), ఎల్.ఎల్.బి, ఒకటవ, రెండవ, మూడవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు నవంబర్ / డిసెంబర్ 2024 లో ప్రకటించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఒక్క పేపర్ కు 500 రూపాయలు రివాల్యుయేషన్ ఫామ్ కు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ డిసెంబర్ 12 సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని తెలిపారు.