నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (బి. ఏ, బి. కామ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బి బి ఏ, బీసీఏ ) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టార్ ఆచార్య ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ విడుదల చేశారు. బిఎ లో 3534 మంది విద్యార్థులు హాజరుకాగా 998 మంది 28.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 13.70 శాతం కాగా బాలికలు 44.04శాతం ఉత్తీర్ణులైనారు. బికాం లో 5578మంది విద్యార్థులు హాజరుకాగా 1902 మంది 34.10 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 17.55 శాతం కాగా బాలికలు 49.76శాతం ఉత్తీర్ణులైనారు. బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 5644 మంది విద్యార్థులు హాజరుకాగా 2279మంది 40.38 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 17.34శాతం కాగా బాలికలు 44.04శాతం ఉత్తీర్ణులైనారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో 4199 మంది విద్యార్థులు హాజరుకాగా 1003మంది 23.89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 6.01 శాతం కాగా బాలికలు 31.31శాతం ఉత్తీర్ణులైనారు. బిబిఎ లో 597 మంది విద్యార్థులు హాజరుకాగా 252 మంది 42.21శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 21.45 శాతం కాగా బాలికలు 65.72శాతం ఉత్తీర్ణులైనారు. బిసిఎ లో 22 మంది విద్యార్థులు హాజరుకాగా 2 (ఇద్దరు )మంది 9.09శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 5.00 శాతం కాగా బాలికలు 50.0శాతం ఉత్తీర్ణులైనారు. మొత్తం విద్యార్థులు19574మంది విద్యార్థులు హాజరుకాగా 6436మంది 32.88శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 14.58 శాతం కాగా బాలికలు 42.83శాతం ఉత్తీర్ణులైనారు. ఈ ఫలితాల ప్రకటన కార్యక్రమంలో అడిషనల్ కంట్రోల్లోర్స్ డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.