పంచాయతీ ఎన్నికలపై స్టేకు నిరాకరణ
హైదరాబాద్,బతుకమ్మ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ వెనుకబడిన కులసంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు వేశాయి. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికలప ప్రక్రియ ప్రారంభమైనందున ఈదశలో స్టే విధించలేమని కోర్టు తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.