Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 7:18 pm Posted by : ramakrishna

కాకతీయకు తగ్గింపు.. లక్ష్మికి పెంపు..

బతుకమ్మ,మెండోరా: కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను తగ్గించారు. మొదట 5000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగినప్పటికీ  సోమవారం ఉదయం నుంచి 3500 క్యూసెక్కుల నీటి విడుదలకు తగ్గించారు. లక్ష్మీ కాల్వ ద్వారా నీటి విడుదల పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు మొదట 200 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా సోమవారం సాయంకాలం 50 క్యూసెక్కుల అదనంగా పెంచడంతో ప్రస్తుతం కాలువ ద్వారా 250 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. సరస్వతి కాల్వ ద్వారా 700 కి చెక్కులు వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1088.10 అడుగులు 70.14 ఎంసీల నీరు నిల్వ ఉంది.