డిల్లీ, బతుకమ్మ : డిల్లీలో పొగమంచు కప్పేయడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే విమానాల రద్దు, ప్రయాణ సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్ సైట్లను సంప్రదించాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. సోమవారం ఉదయం డిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 403 గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.