ఐదు ఫోన్ల రికవరీ
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల పరిధిలోని ఐదుగురు భాధితులు తమ ఫోన్లను పోగొట్టుకోవడంతో అట్టి ఫోన్లను భీమ్ గల్ ఎస్సై మహేష్ రికవరీ చేశారు. ఫోన్లు పోగొట్టుకొన్న ఐదుగురు భాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా వారి ఫిర్యాదు మేరకుఎస్సై సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో వాటిని రికవరీ చేశారు. రికవరి అయిన సెల్ ఫోన్ లను భాధితులకు పిలిచి బుధవారం స్టేషన్ లో అందజేశారు.