Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 1:37 pm Posted by : ramakrishna

అయోధ్య ఆలయానికి రికార్డు ఆదాయం

వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశంలో అధికంగా ఆదాయం వస్తున్న 10 ఆలయాల్లో అయోధ్య ఆలయం మూడో స్థానానికి చేరింది. ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను అయోధ్య ఆలయం అధిగమించింది. గడిచిన ఏడాదిలో అయోధ్యకు రూ.700 కోట్లు ఆదాయం లభిస్తే, షిర్డీ ఆలయానికి ఏటా రూ.450 కోట్ల వరకు, వైష్ణోదేవి ఆలయానికి రూ.400 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మహాకుంభమేళా ప్రారంభమయ్యాక రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. బాలరాముడి ప్రతిష్ఠాపన నుంచి నేటివరకు 13 కోట్ల మంది బాలరామున్ని దర్శించుకున్నారు.