Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 2:17 pm Posted by : ramakrishna

అక్రమ కేసులపై యువతకు  భరోసా

బిచ్కుంద, బతుకమ్మ :  బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు నిర్వహించిన బిచ్కుంద బంద్ మరియు ధర్నా కార్యక్రమాలకు సంబంధించి యువతపై పెట్టిన అక్రమ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ప్రజా సమస్యను ప్రశ్నించినందుకు యువతను బెదిరించడం ప్రజాస్వామ్యానికి పనికిరాని విధానం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో యువతకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ సింధే , బాధిత యువకులను   కలిసి వారికి  ధైర్యం చెప్పారు. ప్రజల కోసం గొంతు వినిపించడం తప్పేదేమీ చేయలేదని, ఇలాంటి అక్రమ కేసులు ఎవరినీ భయపెట్టలేవని స్పష్టం చేశారు. కేసులు నమోదైన బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  యువకులు భయపడాల్సిన అవసరం లేదని,  మీ వెంటే నేనున్నానని,  ప్రజా హక్కుల కోసం పోరాడిన ప్రతి ఒక్కరి కోసం అండగా నిలబడతాను అని భరోసా కల్పించారు.
సెంట్రల్ లైటింగ్ లాంటి ప్రాథమిక సౌకర్యం కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.
జుక్కల్ నియోజకవర్గ యువత, ప్రజల పైన అక్రమ కేసులు పెట్టిన మా ప్రభుత్వం రాగానే అవి అన్ని ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.