హుస్నాబాద్, బతుకమ్మ : ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ను ఆదివారం మంత్రి సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా పాలన పని చేస్తుందని మంత్రి పొన్నం వివరించారు.
