బతుకమ్మ: బిచ్కుంద : రాష్ట్రంలో పోలీసుల బదిలీలు కొనసాగుతున్నాయి ఇటీవల సిఐలు ఎస్ఐలు బదిలీ కాగా తాజాగా మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు స్థానం చలనం కల్పిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈమెరకు మల్టీ జోన్ -1 ఐ జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు కామారెడ్డి జిల్లా బిచ్కుంద సీఐ జగడం నరేష్ ను బదిలీ చేశారు. ఆయనను ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో బిచ్కుంద సీఐగా మంతెన రవికుమార్ రానున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు.