సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్
ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం బకాయిలు చెల్లిస్తేనే రేషన్ పంపిణీ 125 కోట్ల బకాయిలు పెండింగ్ సెప్టెంబర్ 4న అసెంబ్లీ ముట్టడికి పిలుపు హైదరాబాద్, బతుకమ్మ : రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. కమీషన్ బకాయిల కోసం కాంగ్రెస్ సర్కారుకు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేయబోమని తేల్చి చెప్పారు. బియ్యం పంపిణీ బకాయిలను వెంటనే...