Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 9:10 pm Posted by : ramakrishna

20 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టివేత

బోధన్, బతుకమ్మ :బోధన్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో బోలెరా వాహనంలో తరలిస్తున్న 20 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం బోధన్ సిఐ వెంకట నారాయణ ఆదేశాల మేరకు పోలీసులు ఆటోనగర్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఎపీ 25 ఎక్స్ 8737 బోలెరో వాహనంలో 50 బస్తాలలో 20 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. సంబంధిత బియ్యాన్ని రీసైక్లింగ్ కోసం తరలిస్తుండగా పట్టుకున్నారు.