సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ
నిజామాబాద్, బతుకమ్మ : బీసీ లకు రాష్ట్రంలో అన్ని రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగంగా శనివారం నగరంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ద్వారకానగర్ నుంచి బస్టాండ్ , రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం...