రాష్ట్ర స్థాయి కబడ్డీ టెక్నికల్ అఫిషల్ గా రాజేందర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆదిలాబాద్ లో జరిగే  71వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ కి టెక్నికల్ ఆఫీషల్ గా కమ్మరపల్లి మండలం అమీర్ నగర్  గ్రామానికి చెందిన బెరిగిడి  రాజేందర్ ఎంపిక అయ్యాడని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంద్యాల లింగయ్య, జిల్లా కబడ్డీ సెక్రటరీ  కే. గంగాధర్ రెడ్డి లు తెలిపారు.  రాజేందర్ ప్రసుతం నిజామాబాదులో గల  కాకతీయ ఒలంపియాడ్ ప్రైవేట్ పాఠశాల లో పి.ఈ.టీ గా విధులు నిర్వహిస్తున్నాడు.