Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 3:17 pm Posted by : ramakrishna

రాజాసింగ్​ రాజీనామాకు ఆమోదం

ప్రకటన విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ రాజీనామా ను ఆమోదిస్తూ.   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్ శుక్రవారం​ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్​ నాయకుడు రామచందర్​రావు  ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.  రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్​ వేయడానికి వెళ్తే అడ్డుకున్నారని రాజాసింగ్​ ఆరోపించారు. ఈ క్రమంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా నాశనం చేసే వారికి పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన జూన్​ 30న కిషన్​ రెడ్డికి  తన రాజీనామా సమర్పించారు. తాజాగా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆయన రాజీనామాకు   ఆమోదం తెలిపారు.