Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 2:37 pm Posted by : ramakrishna

పైపుల రాజారెడ్డి మరణం సమాజానికి తీరని లోటు

రాజారెడ్డి పార్ధివ దేహానికి నివాళులార్పించిన వేముల

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి

ప్రముఖ సమాజ సేవకుడు పైపుల రాజారెడ్డి మరణం సమాజానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోనీ లాలన వృద్ధాశ్రమంలో నిర్వహించిన రాజారెడ్డి అంత్యక్రియలకు హాజరైన ఆయన పార్ధివ దేహం పై పుష్పమాల వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్చంద సేవా సంస్థల ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఉన్నత విద్యా కోసం ఆర్ధిక సహాయం చేశారని, అలాగే లాలన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నీడలేని ఎందరో వృద్దులకు భరోసాను ఇచ్చారన్నారు. ఆయన సమాజ సేవ కార్యక్రమాలను గుర్తు చేసుకొంటూ సమాజ హితం కోరే రాజారెడ్డి లాంటి మనిషి మన మద్యల లేకపోవడం తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించిన వేముల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోశారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి, బీయర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 Raja Reddy's death is a great loss to the society