Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2025, 5:25 pm Posted by : ramakrishna

రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా  రాజా నరేందర్ గౌడ్

నిజామాబాద్, బతుకమ్మ:

సుదీర్ఘ కాలంగా పార్టీ తరపున కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా  నియమించారు. ఈ మేరకు  ఈ నెల 10 రాష్ట్ర రవాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజా నరేందర్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ధన్యవాదాలు తెలిపారు.

Raja Narendra Goud as members of State Regional Transport Authority