జుక్కల్ నియోజకవర్గం లో అతలాకుతలం చేస్తున్న వర్షాలు

  . . . బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న 8 మంది  కూలీలు  బాన్సువాడ, బతుకమ్మ : భారీ వర్షాల కారణంగా జుక్కల్​ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.  మంజీర పరవళ్లు.. మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.. ఎగువ నుంచి విపరీతంగా వస్తున్న వరదల కారణంగా నిజాంసాగర్​ ప్రాజెక్టు 16 గేట్లు వదిలి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు....