Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 12:45 pm Posted by : ramakrishna

 15 సెల్ పోన్ లను రికవరీ చేసిన రైల్వే పోలిస్ లు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్లలో , ప్లాట్ఫామ్ పైన ఫోన్లు పోయిన, చోరికి గురైన వెంటనే ఫిర్యాదు  చేయాలని నిజామాబాద్ రైల్వే పోలిస్ స్టేషన్ ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ నెలలో  మొత్తం 15 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. సెల్ పోన్ లను రికవరీ చేయడంలో సిఇఐఆర్ పోర్టల్  వివరాలను అప్లోడ్ చేసి దాని ద్వారా పోయిన సెల్ పోన్ లను ట్రెస్  చేసి ఎవరి దగ్గర అయితే ఫోన్ ఉన్నాయో వారి దగ్గర నుంచి రికవరీ చేసిన ఫొన్స్ వాటి యొక్క ఓనర్స్ కు అప్పగించడం జరుగుతుందన్నారు. పోన్ ల రికవరిలో సిబ్బంది గురుదాస్, రాములు, నజ్మాలను అభినందించారు.