ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త

వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త  చెప్పింది.   జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.  అలాగే ఇతర బ్రాండ్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల ధరలు కూడా  రైల్వే శాఖ తగ్గించింది.  సవరించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి.  ఇప్పటివరకు లీటర్‌ రూ.15లకు విక్రయిస్తుండగా.. ఇక నుంచి రూ.14 లకే  రైల్‌ నీర్‌ వాటర్‌ బాటిల్‌ లభించనుంది.