Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 3:29 pm Posted by : ramakrishna

రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

. . . వాగులో పడి గొర్రెల కాపరి గల్లంతు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణ శివారులో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి  చెందాయి. ఆదివారం కామారెడ్డి శివారులో ఓ వాగు పై నుంచి గొర్రెలు వెళ్తుండగా అదే సమయంలో రైలు రావడంతో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి సురేష్ వాగులో పడి గల్లంతయ్యారు. సంఘటన స్థలానికి కామారెడ్డి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Railu ḍhīkoni 90 gorrelu mr̥ti
90 sheep killed in train collision