Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 11:23 pm Posted by : ramakrishna

నిజామాబాద్​ మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్​

  • ఎంబీబీఎస్ విద్యార్థిని చితకబాదిన పీజీ విద్యార్థులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్​లు ర్యాగింగ్​కు పాల్పడ్డారు. సుమారు పది మంది విద్యార్థుల వరకు కలిసి చితకబాదారు.  హైదరాబాద్​ సమీపంలోని పటాన్​చెరుకు చెందిన యువకుడు​ రాహుల్​ నిజామాబాద్​లోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్​ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తించాడు. రాహుల్​ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్​లు  రిజిస్టర్​లో నమోదు చేశారు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎందుకు గైర్హాజరు వేశారని బాధిత విద్యార్థి సీనియర్​ల వద్దకు వెళ్లి అడిగాడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్​లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.