- ఎంబీబీఎస్ విద్యార్థిని చితకబాదిన పీజీ విద్యార్థులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. సుమారు పది మంది విద్యార్థుల వరకు కలిసి చితకబాదారు. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు రిజిస్టర్లో నమోదు చేశారు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎందుకు గైర్హాజరు వేశారని బాధిత విద్యార్థి సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.