ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
ఎల్లారెడ్డి, బతుకమ్మ: పట్టణ ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కారం చూపారు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్. మంగళవారం పట్టణంలో పర్యటించిన ఆయన అధికారుల ముందు ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కమిషనర్ శ్రీహరి రాజును కోరారు.