- ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి
బతుకమ్మ, కోటగిరి : సర్వ రోగ నివారిణిగా స్వచ్ఛమైన ఈత కల్లు పనిచేస్తుందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘంని సందర్శించి 2020లో హరితహారం లో భాగంగా పెట్టిన ఈత చెట్ల పెంపకం గీత కార్మికుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు స్వచమైన కల్లును అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ బోధన్ సీఐ భాస్కర్ రావు, ఎస్సై జమీల్, డి టి ఎఫ్ ఎస్ ఐ విలాస్ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది సుదర్శన్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీవిద్య, సుమలత, మహేష్, కోటగిరి టిసిఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఆర్ అరుణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి విట్టల్ గౌడ్, గౌడ సంఘం నాయకులు డిసీధర్ గౌడ్, గంగ ప్రసాద్ గౌడ్, గీత కార్మికులు ఎం.శ్రీనివాస్ గౌడ్, ఏ.శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ గౌడ్, ఎం.సాయిబాబా గౌడ్, కృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.