Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2025, 12:11 pm Posted by : ramakrishna

క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన పూజారా

వెబ్ న్యూస్, బతుకమ్మ : అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఛతేశ్వర్ పూజారా ’ఎక్స్‘ వేదికగా ప్రకటించారు. భారత జెర్సీని ధరించి ఆడినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. తనకు మద్దతునిచ్చిన అభిమానులకు  కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి 2010 అడుగిడినా పూజారా 103 టెస్టులు ఆడాడు. మూడు డబుల్ సెంచరీలు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7,195 పరుగలు చేశాడు. ఐదు వన్డేలు ఆడి 51 పరుగులు చేశాడు. 2023లో చివరిసారిగా భారత్ తరపున ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు.