ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
బతుకమ్మ బోధన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, పోలీసు శాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తాసిల్దార్ విటల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ప్రముఖ నాయకులు పాషా మొయినుద్దీన్, తూము శరత్ రెడ్డి, అంకు దాము తదితరులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.