రుద్రూర్, బతుకమ్మ: మొబైల్ ఫోన్ లు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఏడుగురు వ్యక్తుల ఫోన్ లను సీ ఈ ఐ ఆర్ పోర్టల్ (సెంట్రల్ ఏక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా ఫోన్ లను రికవరీ చేసి పోగొట్టుకున్న వ్యక్తులు జంగం గంగాధర్, రేపల్లి శ్రీనివాస్, బిచాల్వార్ గంగాధర్, సూర్య కిరణ్, గంగుల రవీందర్, లక్కా సత్యనారాయణ, ఎండి మొహమ్మద్ లకు గురువారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ ఎస్సై పి.సాయన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సాగర్ తదితరులు పాల్గొన్నారు.