Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 6:11 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాలకు అర్థిక సహాయం అందజేత

బాన్సువాడ, బతుకమ్మ : ఇటీవల కొన్ని రోజులు కురిసిన బారి వర్షల వల్ల చందూర్ గ్రామంలోని పలు కాలనీలలో జనవాసాల్లోకి నీరు చేరడంతో  చాలవరకు అస్థి నష్టం జరిగింది.విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కనీస అవసరలా నిమిత్తం సుమారు 60 కుటుంబాలకు అర్థిక సహాయం చేశారు. బిఆర్ఎస్ పార్టీ తరుపున నష్టపోయిన కుటుంబాలకు అండగా మేమున్నామని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమములో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్,మాజీ రైతు బంధు సమన్వయ సమితి అద్యక్షులు డాక్టర్ అంజిరెడ్డి, రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ల ఫోరం అద్యక్షులు యలమంచిలి శ్రీనివాస్,స్థానిక బీఆర్​ఎస్​ నాయకులు తదితరులు ఉన్నారు.