Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 5:03 pm Posted by : ramakrishna

వర్షకాలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి

  • చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) అశోక్

బతుకమ్మ, నిజామాబాద్: భారీ వర్షాల సమయంలో నిజామాబాద్ నగరంలో విద్యుత్తు శాఖ పరంగా ఎలాంటి నష్టం జరగకుండా నిరంతరాయంగా విద్యుత్తు అందించినందుకు వరంగల్ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) అశోక్ అధికారులను సిబ్బందిని అభినందించారు. మంగళవారం నిజామాబాద్ లో లెవెన్ కె.వి లైన్స్ లో రింగ్ మెయిన్స్ ఏర్పాటు చేయడానికి కావలసిన చేయవలసిన పనుల గురించి ఏడీఈ లు ఏఈలు తో సమీక్ష సమావేశ నిర్వహించడం జరిగింది . ఈ సంధర్బంగా సిఈ ఆశోక్ మాట్లాడుతు… ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ లేకుండా చూడాలని కోరారు. ఏబీ స్వీచ్చులు సరిచేయాలని , కరేంటు ప్రమాదాలు జరుగకుండా సిబ్బంది భద్రత తీసుకొని చేయాలని చేయవలసిన పనులను ప్రతిరోజు సమీక్ష జరపాలని అన్నారు. ఈనెల 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొవాలని అధికారులు సిబ్బందికి సూచించారు. సమీక్ష సమావేశంలో డి ఈ ఎం శ్రీనివాస్, ఎడిఇలు ఆర్ చంద్రశేఖర్, తోట రాజశేఖర్, పి వీరేశం, ప్రశాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ,ఏ ఇ లు నగేష్, ఆర్ సుమిత ,డి శ్రీనివాస్, నాగ శర్వాణి, మహమ్మద్ రవూప్, అన్నయ్య ,గంగా శేఖర్, శ్రీ విద్య, అసరుద్దీన్ పాల్గొన్నారు.