Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 6:40 pm Posted by : ramakrishna

నల్ల బ్యాడ్జీలతో నిరసన

బతుకమ్మ మెండోరా: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల మీద సోమవారం జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా మంగళవారం నల్ల బ్యాడ్జీలు  ధరించి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఉద్యోగులు నిరసన తెలియజేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కార్యాలయం ఉద్యోగులు టీఎన్జీవో నాయకులు రియాజ్ అహ్మద్, సినీయర్ అసిస్టెంట్ ఆధ్వర్యం లో కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీ ఈ ఈ గంగభూసాన్, డీ ఈ ఈ సుకుమార్ , డీఈఈ రఘుపతి, డి ఈ ఈ గణేష్, ఏ ఈ ఈ మాధురి, ఏ ఈ ఈ మాణిక్యం,ఏ ఈ ఈ పవన్, టీ వో రాజారెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నా రు.