Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 12:21 pm Posted by : ramakrishna

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  బంగ్లాదేశ్ లో  దీపు అనే యువకుడి దారుణ హత్యపై విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మంగళవారం జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు ధాత్రిక రమేశ్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ లో బంగ్లాదేశ్ జాతీయ జెండా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనార్టీల జీవితాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రజలు భారత దేశంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే అక్కడ మైనార్టీల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని అన్నారు. బంగ్లాదేశ్ లో  మైనార్టీల కోసం భారతదేశం జోక్యం చేసుకోవాలని కోరారు.