నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేశపురం రమేష్, మల్లమారి మల్లిఖార్జున్ ఒక ప్రకనటనలో తెలిపారు. రాష్ట్ర కమిటి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో గల తుక్కుగూడ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంబలి రామలుకు జరిగిన అవమానానికి నిరసనగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు పేర్కొన్నారు.