రుద్రూర్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక అధికారి డిఎం ప్రవీణ్ సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, అంబం గ్రామంలో పాఠశాలలను శనివారం ప్రత్యేక అధికారి డిఎం ప్రవీణ్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డిలు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలో వంటగది, శిథిలావస్థలో చేరిన పాఠశాలల భవనాలను వారీరు పరిశీలించారు. వారి వెంట గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
