తెలంగాణ మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్
ప్రిన్సిపల్ డా.ప్రవీణ్ మామిడాల నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ అని ప్రిన్సిపల్ డా.ప్రవీణ్ మామిడాల అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ...