Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 1:58 pm Posted by : ramakrishna

అస్సాం  స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ప్రియాంక గాంధీ

వెబ్ న్యూస్,బతుకమ్మ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి ఆపార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ప్రియాంక గాంధీ నియామకమయ్యారు. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈకమిటీలో లోకసభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్ లను సభ్యులుగా నియమించారు.  ఈఏడాది అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా  స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.