కామారెడ్డి సబ్ జైలును సదర్శించిన జైళ్ల శాఖ డిజి

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి సబ్ జైలును సోమవారం జైళ్లశాఖ డిజి డా.సౌమ్య మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో గార్డెనింగ్ నిర్వహణ పరిశుభ్రత బాగుందని అధికారులను అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట వరంగల్ రేంజ్ డిఐజి ఆఫ్ ప్రిజన్స్ ఎం.సంపత్, కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఉన్నారు.