డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు.. జరిమానా

ఒకరికి 10రోజుల జైలు శిక్ష, 15మందికి జరిమానా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి  ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ గురువారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచారు వీరిలో 15 మందికి రూ.21,500 జరిమానా, బోర్గం పి గ్రామానికి చెందిన చామకూర లక్పతి తరచుగా (మూడుసార్లు) మద్యం తాగి దొరకడం వలన పది రోజుల జైలు శిక్ష విధించారు.