హైదరాబాద్, బతుకమ్మ :
మూడవ సారి ప్రధాన మంత్రి అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలి సారి తెలంగాణకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.

ప్రధాని తమ ఇంటికి విచ్చేయడంతో పవన్ కళ్యాణ్ కుటుంబం నరేంద్ర మోదీ కి హార్ధిక స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ని ప్రధాని పరామర్శించారు.
