వెబ్ న్యూస్, బతుకమ్మ : జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ఆయన సెండాయ్ నగరానికి వెళ్లారు. బుల్లెట్ ట్రైన్, ఆల్ఫా ఎక్స్ రైలు సాంకేతికల గురించి అధికారులు మోదీకి వివరించారు. అంతకు ముందు మోదీ అక్కడి భారతీయ ట్రైన్ డ్రైవర్స్ తో మాట్లాడారు.