హైదరాబాద్, బతుకమ్మ :
ఈ నెల 10న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు అంకురార్పణ జరిగింది. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర బిజేపి అధ్యక్షులు రాం చంద్రరావు అధ్వర్యంలో పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ప్రధానిగా మూడవ సారి ఎన్నికైన తరువాత మోడీ పర్యటనకు బిజేపి తీవ్ర కసరత్తు చేస్తుంది. ఐదు రాష్ర్టాల ఎన్నికల పలితాల తరువాత మోడి అధికార పర్యటన తెలంగాణ కావడంతో బిజేపి శ్రేణులు బహిరంగ సభ సక్సేస్ చేసేందుకు కష్ట పడాలని రాష్ట్ర అధ్యక్షుడు రాం చంద్రరావు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డా. లక్ష్మణ్, ఈటల రాజేందర్, కోండా విశ్వేశ్వర్ రెడ్డిలతో పాటు తదితరులు ఉన్నారు.