రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామానికి చెందిన దాత్రిక విఘ్నేష్ కు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించడంతో బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్రిక్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ నవీన్, ఇందూర్ హై స్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిషోర్, ప్రసాద్, విఘ్నేష్ తల్లి దండ్రులు రోజా, మహేష్ తదితరులు ఉన్నారు.