నిజామాబాద్, బతుకమ్మ : సాధారణ ప్రసవం కోసం గర్భిణులు ప్రతి రోజూ ఉదయం యోగా చేయాలని జిల్లా ఆయుష్ విభాగం ఇన్ చార్జి డాక్టర్ గంగా దాస్ పేర్కొన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. నగరంలోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా మాసోత్సవాల్లో భాగంగా శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు యోగా నేర్పించాలని సూచించారు.ఈకార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు శ్రీలత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ స్వర్ణ లత, డీపీఎం వందన, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగా శిక్షకులు స్వప్న, విజయ, రాజేందర్, రమేష్, అంగన్ వాడీ టీచర్లు గర్భిణలు పాల్గొన్నారు.