వర్షాల కోసం పూజలు

మద్నూర్, బతుకమ్మ: వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు పూజలు నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం వర్షాలు కురువాలని గ్రామ దేవతలకు జలాభిషేకం ఉత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ముందుగా నడిమి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి శివలింగం నిండుగా జలాభిషేకం చేపట్టారు. తర్వాత భాజాభజంత్రిలతో గ్రామంలో ఉన్న దేవాలయాలకు వెళ్లి నీళు పోసి అభిషేకం చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.