చెన్నశ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అభ్యాస పాఠశాల లో చెన్న శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కోటగల్లీలోని జీజీహెచ్ఎస్  విద్యార్ధిని డి. అక్షరకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్ష కార్యదర్శులు ధర్మెంధర్,శ్రీకాంత్,కోటగల్లి పాఠశాల ఉపాధ్యాయులు జయశ్రీ, టీజీఎన్పీడీసీఎల్ ఏడీఈ తోట రాజా శేఖర్, పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్,  ప్రిన్సిపల్  చెన్న అన్నపూర్ణ కుటుంబ సభ్యులు,  ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.