Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 5:04 pm Posted by : ramakrishna

చెన్నశ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అభ్యాస పాఠశాల లో చెన్న శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కోటగల్లీలోని జీజీహెచ్ఎస్  విద్యార్ధిని డి. అక్షరకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్ష కార్యదర్శులు ధర్మెంధర్,శ్రీకాంత్,కోటగల్లి పాఠశాల ఉపాధ్యాయులు జయశ్రీ, టీజీఎన్పీడీసీఎల్ ఏడీఈ తోట రాజా శేఖర్, పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్,  ప్రిన్సిపల్  చెన్న అన్నపూర్ణ కుటుంబ సభ్యులు,  ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Pratibha Puraskar under the auspices of Chenna Srinivas Memorial Trust