Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 12:30 pm Posted by : ramakrishna

ప్రణయ్ హత్య కేసు .. సంచలన తీర్పునిచ్చిన కోర్టు

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు  సంచలన తీర్పు వెలువరించింది. ఏ2 సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు.  కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి 8 మందిని నిందితులుగా 2019లో ఛార్జిషీటు దాఖలు  చేశారు. ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగి.. ఇటీవల వాదనలు ముగిశాయి. సోమవారం కోర్టు తీర్పునిచ్చింది.