Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2025, 1:00 pm Posted by : ramakrishna

రేపు నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు..

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ టౌన్ ఏడీఈ-2 ఆర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. తిలక్ గార్డెన్ సబ్ స్టేషన్ లోని 8ఎంవీఏ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తగా 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్  ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తిలక్ గార్డెన్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.